Danvapiro - stocunatev.wixsite.com. Read Online Now midhunam sri ramana Ebook PDF at our Library. Midhunam Telugu Novel Pdf.barrister-parvateesam-novel-telugu.pdf (141.06 MB ).
కినిగె వారు పాఠకులకు మిథునం పుస్తకం గురించి సరైన సమాచారం ఇవ్వటం లేదు. ఇన్నాళ్ళూ నేను ఇది ఒక్క మిథునం కథే అనుకుని కొనలేదు. సినిమా చూసేశాం, ఇంటర్నెట్లో దొరుకుతున్న పి డి ఎఫ్ ఫైలు చదివేశాము కాబట్టి ఈ పుస్తకం ఎందుకు అని నా భావన. కాని కొద్ది రోజుల క్రితం, కినిగె వారి వద్ద ఉన్నా నా డబ్బులు పూర్తిగా సున్నా చుట్టెయ్యటానికి ప్రయత్నిస్తూ ఈ మిధునం పుస్తకం, చదివినా సరే మన దగ్గర ఉండాల్సిన పుస్తకం, మరొకసారి ప్రింటులో ఎప్పుడైనా చదువుకోవచ్చు అని ఇతర పుస్తకాలతోపాటు బాలెన్సు సరిపెట్టటానికి కొనేశాను. తీరా బండిల్ నాకు అందిన అద్భుత క్షణంలో (నేను ఆర్డర్ చేసిన నిమిషం నుంచి ఆ పుస్తకాల పాకెట్ అందేవరకూ ఆతృతే, అంది పుఇస్తకాలు చూసుకునేవి అమృత క్షణాలు) ముందుగా మిథునమే చేతిలోకి వచ్చింది. చూద్దును కదా! అబ్బా ఎన్నెన్ని కథలు, మిథునం ఎక్కడో చివరలో ఉన్నది. మొదటి నుంచి చివర దాకా ఏడు కథలు ఉన్నాయి. అన్నీ కూడా మిథునం అంత గొప్పవే. ముఖ్యంగా బంగారు మురుగులు.
ఈ పుస్తకంలో ఇన్ని కథలున్నాయని, కినిగె వారు ఎక్కడా వ్రాయలేదు. ఇది అన్యాయం అనిపించింది. ఇది ఒక కథా సంకలమనీ, ఇందులో మొత్తం 8 కథలున్నాయని వ్రాయాలి. తెలియని నా వంటి పామరులకు తెలియాల్సిన అవసరం ఉన్నది కదా. మిథునం కాకుండా ఇంకా ఏడు కథలున్నాయని తెలిస్తే ఎప్పుడో కొనేవాణ్ణి ఈ పుస్తకం. నావంటి వాళ్ళు (పుస్తకం ఖరీదు, ఇందులో ఎన్ని కథలు అని తూకం వేసి కొనే సజ్జు) ఇంకెందరున్నారో మరి! కినిగె వారు ఇప్పటికన్నా ఈ పుస్తకం గురించి వ్రాసిన నాలుగు మాటల్లో ఇదొక కథ సంకలమని తెలియచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని నా అభిప్రాయం.
Rs.60.00
Author:Sri Ramana
Publisher: Navodaya Book House
Publisher: Navodaya Book House
1 reviewsWrite a review
తెలుగు పాఠకులు విశేషంగా ఆదరించిన శ్రీరమణ కథలను సంపుటిగా విూ ముందు వుంచుతున్నాము. ఇందులో అయిదేళ్ళలో (1993-97) వచ్చిన కథలున్నాయి. దాదాపు ఇందులో మళ్ళీ మళ్ళీ వేర్వేరు పత్రికలలో అచ్చయినవే. కొన్ని కథలు మంచి కథల సరసన కథౄ సంకలనాలలో చోటుచేసుకున్నాయి. అవార్డులు, అంతకు మించి పాఠకుల ప్రశంసలు పుష్కలంగా అందుకున్నాయి.
ప్రముఖ సాహితీవేత్త, చలనచిత్ర దర్శకులు ఎం.టీ. వాసుదేవన్ నాయర్ దృష్టిని 'మిథనం' ఆకర్షించింది.ఈ కథ ఆధారంగా మలయాళంలో 'ఓరు ఊరి పుంజరి' పేరుతో చలనచిత్రం రూపొందించారు.
ప్రముఖ సాహితీవేత్త, చలనచిత్ర దర్శకులు ఎం.టీ. వాసుదేవన్ నాయర్ దృష్టిని 'మిథనం' ఆకర్షించింది.ఈ కథ ఆధారంగా మలయాళంలో 'ఓరు ఊరి పుంజరి' పేరుతో చలనచిత్రం రూపొందించారు.